AP: ఛీ ఛీ ...ఏం మనుషులురా ..తల్లి , కూతురు ఇద్దరితోను లివ్ ఇన్ !

ఏపీలో ఓ ప్రభద్దుడు చేసిన పనికి సభ్యసమాజం పై ఎన్ని మాటలు అన్నా ...తప్పులేదనిపిస్తుంది. 


Published Oct 24, 2024 01:38:00 PM
postImages/2024-10-24/1729757357_385267cohabitationwithmotherloveaffairwithdaughterincidentinongolearea.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బ్రహ్మాం గారు చెప్తే ఏమోలే మనుషులు మరీ అంత దిగజారిపోరు అనుకున్నాం కాని అలా అనుకున్న దాని కంటే ఎక్కువగా దిగజారిపోతున్నారు. తల్లి , కూతురు , పెళ్లాం , చెల్లి వావి వరసలు లేని మతిలేని మనుషులైపోతున్నారు . ఏపీలో ఓ ప్రభద్దుడు చేసిన పనికి సభ్యసమాజం పై ఎన్ని మాటలు అన్నా ...తప్పులేదనిపిస్తుంది. 


ఒంగోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. చిన్నా చితకా పనులు చేసుకుంటు పిల్లను పెంచుకుంటుంది. ఇలాంటి టైంలోనే టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు.ఇండ్లా రాజు అనే వ్యక్తితో ఈ తల్లీకూతుళ్లకు పరిచయం ఏర్పడింది. మహిళలతో రాజు సహజీవనం చేయడం ప్రారంభించాడు. తల్లి తనకు ఓ మంచి తోడు దొరికిందనుకున్నారు. తండ్రి స్థానంలో తన కూతురును బాగా చూసుకుంటున్నాడని అనుకున్నారు. 


కాని రాజు మనసులో మరో కథ నడుస్తుంది. తల్లితో సహజీవనం చేస్తూ తన కూతురు తో ప్రేమ కథ నడిపాడు. ఆ పిల్లకూడా దీనికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అతడిని నమ్మిన ఆ బాలిక ఏం చెప్పినా వినడం మొదలుపెట్టింది. ఇక ఆమెను పూర్తిగా లోబర్చుకున్న తర్వాత  రాజు ఆమె తల్లి వద్ద నుంచి బాలికను తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. అలా రెండ్రోజుల క్రితం రోజూలాగే బాలికను స్కూల్​లో దింపొస్తానని ఆమె తల్లికి చెప్పి తీసుకెళ్లాడు.  ఇక అక్కడి నుంచి హైదరాబాద్ కు పరారయ్యారు. తల్లి మాత్రం పిల్ల కనిపించడం లేదని రాత్రి వరకు వెతికి ...పోలీసులకు పిర్యాధు చేయడంతో వెంటనే పోలీసులు వెతికి ...అసలు కథను బయట పెట్టారు.ఆ తర్వాత బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమె తల్లితో ఇంటికి పంపించారు. ఇక రాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాని విషయం తెలిసిన జనాలు మాత్రం రాజు పై చివాట్లు పెడుతున్నారు. వావి వరుస లేని వాడంటు తిడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu affair mother daughter

Related Articles