Anasuya:ఆంటీ నువ్ మారవా ఇక.?

అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నటిగా ఎంతో గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి నటిమని. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే అనసూయ భరద్వాజ్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ట్రోలింగ్స్ గురవుతూనే ఉంటుంది. అంతేకాదు తనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వారికి కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతుంది.  అలాంటి అనసూయ తాజాగా మరోరకంగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అనసూయ భరద్వాజ్ సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత చిన్న చిన్న షోలు చేసుకుంటూ జబర్దస్త్ కామెడీ షోలకి ఎంట్రీ ఇచ్చింది.


Published Jul 25, 2024 10:07:00 AM
postImages/2024-07-25/1721879167_ansuya12.jpg

న్యూస్ లైన్ డెస్క్: అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నటిగా ఎంతో గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి నటిమని. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే అనసూయ భరద్వాజ్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ట్రోలింగ్స్ గురవుతూనే ఉంటుంది. అంతేకాదు తనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వారికి కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతుంది.  అలాంటి అనసూయ తాజాగా మరోరకంగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అనసూయ భరద్వాజ్ సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత చిన్న చిన్న షోలు చేసుకుంటూ జబర్దస్త్ కామెడీ షోలకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక్కడ యాంకర్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.  యాంకరింగ్ తో పాటు తన అంద చందాలను చూపిస్తూ ఎంతో పాపులర్ అయింది.  అలా అనసూయ సినిమా ఫంక్షన్స్, స్పెషల్ ఈవెంట్స్, అవార్డు ఫంక్షన్స్ ఇలా  ఏ ఫంక్షన్ జరిగిన దానికి యాంకర్ గా  చేయడంతో ఇండస్ట్రీలో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ చేసి తన నటనా టాలెంటును మరింత నిరూపించుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్పాలో ద్రాక్షాయనిగా చేసి అభిమానులను మరింత మెప్పించింది.  

అలా పలు సినిమాలతో దూసుకెళ్తున్న అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తనకు  సంబంధించినటువంటి హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల నుంచి హాట్ హాట్ కామెంట్లను తీసుకుంటుంది. అలాంటి అనసూయను ఆంటీ అని ఎవరైనా పిలిస్తే అస్సలు ఇష్టం ఉండదు. అయితే గతంలో అనసూయ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ట్రోలింగ్ కు దిగుతున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గలేదు.

https://x.com/anusuyakhasba/status/1816155138421317791?t=-g9TkAXqMyi08Zh4ip-e7A&s=08

ఆ తర్వాత ఇరుపక్షాలు శాంతించడంతో వివాదం తగ్గింది. అయినా అనసూయ ఏదైనా మీడియా లేదా ఇంటర్వ్యూలలో పాల్గొంటే ఆమెపై దేవరకొండ ఫ్యాన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె సింబా అనే మూవీలో నటించింది.  ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొంది.  అయితే ఈ ట్రైలర్ లో అక్క నీకు విజయ్ దేవరకొండలాంటి మొగుడు వస్తాడు అని ఒక చిన్న సీన్ ఉంటుంది. దీంతో ఆమె ముఖంలో నవ్వులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అందరూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీడియా వారు ప్రశ్నించగా అనసూయ క్లారిటీ ఇచ్చింది.  

నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని కథలో ఓ సన్నివేశంలో డైలాగ్ ఉందన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా చర్చ జరుగుతోంది.  దీంతో కొంతమంది సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక నువ్వు మారవా, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆ హీరోను వాడుకున్నారు. మీరంతా ఒకటే బ్యాచ్, అనసూయ నన్ను అసిస్టెంట్ గా పెట్టుకో. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అన్నింటికీ నేను రాకుండా చూసుకుంటాను. నువ్వు ఎంత చేసినా నీ సినిమా ఎవడు దేకడు ఆంటీ అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line trolling vijaydevarakonda pushpa sukumar anasuya-bharatwaj

Related Articles