Mohanlal: దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దు

హేమా కమిటీ రిపోర్ట్‌ని స్వాగతిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారందరినీ నిందించలేమని తెలిపారు. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని, విచారణ ప్రక్రియకు సహకరిస్తామని ఆయన తెలియజేశారు. 
 


Published Aug 31, 2024 04:02:52 PM
postImages/2024-08-31/1725100372_Castingcouch.jpg

న్యూస్ లైన్, సినిమా: మలయాళ చిత్రపరిశ్రమను జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక కుదిపేస్తోంది. తాజగా, ఈ అంశంపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నటుడు మోహన్‌లాల్ స్పందించారు. ఈ వ్యవహారంలో కేవలం అమ్మను (Association of Malayalam Movie Artists)ను లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయవద్దని కోరారు. హేమా కమిటీ రిపోర్ట్‌ని స్వాగతిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారందరినీ నిందించలేమని తెలిపారు. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని, విచారణ ప్రక్రియకు సహకరిస్తామని ఆయన తెలియజేశారు. 

ఈ విషయాలను సరి చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన అలాంటి పవర్ గ్రూప్ గురించి తెలియదని, తను అందులో భాగం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆయన హేమా కమిటీ నివేదికను చదవలేదని, ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయాలని కోరుతున్నట్టు మోహన్ లాల్ పేర్కొన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాపై పలువురు నటుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam cinema-news mohanlal amma malayalam-film-industry casting-couch

Related Articles