Namrata: రెస్టారెంట్ ఓనర్ తో 9 ఏళ్లు ఎఫైర్ నడిపిన నమ్రత..?

మిస్ వరల్డ్ గా కిరీటం గెలుచుకున్న నమ్రత శిరోద్కర్ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో రాణించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని తెలుగులో అంజి, వంశీ వంటి సినిమాల్లో చేసింది.ఇక వంశీ సినిమాలో చేసే సమయం


Published Sep 27, 2024 01:36:55 PM
postImages/2024-09-27/1727424415_namrata.jpg

న్యూస్ లైన్ డెస్క్: మిస్ వరల్డ్ గా కిరీటం గెలుచుకున్న నమ్రత శిరోద్కర్ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో రాణించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని తెలుగులో అంజి, వంశీ వంటి సినిమాల్లో చేసింది.ఇక వంశీ సినిమాలో చేసే సమయంలోనే మహేష్ బాబు తో ప్రేమలో పడి ఐదు సంవత్సరాలు వీరి ప్రేమను సీక్రెట్ గా కొనసాగించి చివరికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే నమ్రతతో పెళ్లికి మొదట్లో కృష్ణ ఒప్పుకోలేదట.దానికి కారణం అప్పటికే నమ్రత బాలీవుడ్ లో కొన్ని ఎఫైర్లు నడిపిందనే టాక్ వినిపించింది. దాంతో అలాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా వద్దు అని  కృష్ణ పేచి పెట్టారట. ఇక ఆమె ఎఫైర్ల సంగతి ఏమో కానీ మహేష్ కంటే ముందే నమ్రత ఓ రెస్టారెంట్ ఓనర్ ని గాఢంగా ప్రేమించింది.

అయితే ఈ విషయం రూమర్ కాదు స్వయంగా నమ్రత నోటిలో నుండి వచ్చిన మాటలే.నమ్రత ఓ ఇంటర్వ్యూలో.. నేను దీపక్ శెట్టిని తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను.ఆయన ఓ రెస్టారెంట్ ఓనర్. మోడల్ గా చేస్తున్నప్పటి నుండి ఆయనతో ప్రేమలో ఉన్నాను. త్వరలోనే మేం పెళ్లి చేసుకుంటాం అంటూ సంచలన విషయం బయటపెట్టింది.

కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే మహేష్ బాబుతో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది.. ఇక మరో బాధాకరమైన విషయం ఏమిటంటే నమ్రత తొమ్మిదేళ్లు ప్రేమించిన దీపక్ శెట్టి ఓ సముద్ర ప్రమాదంలో మరణించారు. సముద్రంలో చిక్కుకున్న ఓ అబ్బాయిని కాపాడబోయి ఆయనే మరణించారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi news-line mahesh-babu bollywood- namrata krishna

Related Articles