Nikhat Zareen: నిఖత్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!

బాక్సింగ్ వరల్డ్ ఛాంపియ‌న్ నిఖ‌త్ జ‌రీన్‌‌కు పారిస్ ఒలింపిక్స్‌లో నిరశే మిగిలింది. దాంతో నిఖత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Published Aug 01, 2024 05:47:33 AM
postImages/2024-08-01/1722509243_nikhat.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్:  బాక్సింగ్ వరల్డ్ ఛాంపియ‌న్ నిఖ‌త్ జ‌రీన్‌‌కు పారిస్ ఒలింపిక్స్‌లో నిరశే మిగిలింది. దాంతో నిఖత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అనూహ్యంగా ఒలింపిక్స్‌ నుంచి నిఖత్ ఇంటిదారి పట్టింది. 50 కేజీల విభాగంలో పోటీప‌డ్డ నిఖ‌త్ ఆసియా స్వ‌ర్ణ ప‌త‌క విజేత, చైనాకు చెందిన వూ యూ చేతిలో ఓట‌మిపాలైంది. ప్రీ క్వార్ట‌ర్స్‌లో 5-0 తేడాతో నిఖ‌త్ బాక్సింగ్ బౌట్‌ను కోల్పోయింది. పారిస్ ఒలింపిక్స్‌లో అన్‌సీడెడ్‌గా నిఖ‌త్ పోటీలో దిగింది. త‌న రేంజ్‌ను అందుకోవ‌డంలో ఆమె ఇబ్బంది ప‌డింది. నిఖ‌త్ పంచ్‌లు వెల‌వెల‌బోయాయి. 52 కిలోల ఫ్ల‌య్‌వెయిట్‌లోనూ ప్ర‌పంచ చాంపియ‌న్ అయిన చైనా క్రీడాకారిణి బౌట్ మొత్తం ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఈ మెగా టోర్నీలో మెడ‌ల్ సాధిస్తుంద‌ని అనుకున్నా నిఖ‌త్‌కు రెండో రౌండ్‌లోనే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. తొలి రౌండ్‌లో జ‌ర్మ‌నీ బాక్స‌ర్ మాక్సీ క‌రీనా కోయిజ‌ర్‌పై నిఖ‌త్ గెలుపొందింది. అయితే రెండో రౌండ్‌లో మాత్రం వూ యూ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

newsline-whatsapp-channel
Tags : telangana paris-olympic parisolympics paris2024

Related Articles