సురేఖ నిన్ను వదలను..అక్కినేని అఖిల్ ఫైర్.!

మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో విపరీతంగా హైలెట్ అవుతున్నాయి. నిరాధారమైనటువంటి కామెంట్స్ చేయడంతో  సినీ వర్గం మొత్తం ఆమెపై నిప్పులు


Published Oct 04, 2024 12:46:21 PM
postImages/2024-10-04/1728026181_akhil.jpg

న్యూస్ లైన్ డెస్క్: మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్  సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో విపరీతంగా హైలెట్ అవుతున్నాయి. నిరాధారమైనటువంటి కామెంట్స్ చేయడంతో  సినీ వర్గం మొత్తం ఆమెపై నిప్పులు చేరుగుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం బతుకుతున్నటువంటి రాజకీయ నాయకురాలు ఇలా మాట్లాడడం సిగ్గుచేటని  అంటున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూపై  మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ, ఇలా సినీ ప్రముఖులంతా స్పందించారు.

దీంతో కొండా సురేఖ భయపడి  క్షమాపణలు కోరింది. అయితే ఈ షోపై అక్కినేని కుటుంబం కూడా తీవ్రంగా విరుచుకు పడింది. అక్కినేని నాగార్జునతో పాటు నాగచైతన్య, అమల, కొండా సురేఖను తిట్టిపోశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై అమల ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీని కోరింది.

అంతేకాకుండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపారు. ఇక నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇక దీనిపై అక్కినేని హీరో అఖిల్ ఘాటుగా స్పందించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని,  ఇలాంటి వాళ్లు సమాజంలో ఉండడానికి చోటు లేదని సోషల్ మీడియా వేదికగా ఘాటుగా విమర్శించాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna samantha nagachaitanya akhil-akkineni konda-surekha

Related Articles