Street dogs: కుక్కల దాడిలో 8 ఏళ్ల‌ బాలుడు మృతి 2024-06-28 07:53:32

న్యూస్ లైన్ డెస్క్: హైద‌రాబాద్(Hyderabad)లో దారుణం చోటు చేసుకుంది. పటాన్‌చెరు ప‌రిధి ఇస్నాపూర్(Isnapur)లోని మ‌హీధ‌ర వెంచ‌ర్లో విశాల్(8) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘ‌ట‌న‌లో బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డి అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. అయితే న‌గ‌రంలో ఇటీవ‌ల కుక్క‌లు దాడి చేస్తున్న ఘ‌ట‌న‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అవ్వాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జలు కోరుతున్నారు.