Airport : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మద్యం పట్టివేత


Published Sep 05, 2024 02:11:54 PM
postImages/2024-09-05/1725525714_liqour.jpg

న్యూస్ లైన్ డెస్క్ : శంషాబాద్  ఎయిర్ పోర్టులో ఎక్సైజ్ పోలీసులు భారీగా మధ్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 415 బాటిళ్లను శంషాబాధ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పట్టుబడిన మద్యం విలువ దాదాపు రూ.12 లక్షల విలువ చేస్తుందని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా గోవా నుంచి మద్యం తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేశారు. శంషాబాద్ నుంచి మద్యం తరలిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ప్లాన్ ప్రకారం నిర్వహించిన సోదాల్లో భారీగా మద్యం గుర్తించారు. అక్రమ మార్గంలో మద్యం, ఇతర వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల కళ్లు గప్పి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news police shamshabad crime- crime latest-news hyderabad-police

Related Articles