బాయ్స్ తో ఆ రోజు పార్టీకి వెళ్ళా..2 మంత్స్ తర్వాత ప్రెగ్నెంట్..ఎలా?

ప్రస్తుత కాలంలో చాలామంది ఆడపిల్లలు  అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగ పిల్లలతో సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే మగ ఆడవాళ్లు కలిసి అన్ని పనులు


Published Sep 11, 2024 01:25:09 PM
postImages/2024-09-11/1726041309_pregnant.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది ఆడపిల్లలు  అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగ పిల్లలతో సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే మగ ఆడవాళ్లు కలిసి అన్ని పనులు చేస్తారో, ఆ విధంగానే మన ఇండియాలో కూడా కల్చర్ అలవాటవుతుంది. వీకెండ్ వచ్చిందంటే  సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, స్టూడెంట్స్ చాలామంది మగ ఆడ అనే తేడా లేకుండా  పార్టీలు చేసుకోవడం, వెకేషన్స్ వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఈ సంస్కృతి మన ఇండియాలో చెన్నైలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

ఆ విధంగానే లైలా అనే కాలేజీ విద్యార్థి 22 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈమె గత కొన్ని నెలల కిందట  తన తోటి విద్యార్థులతో కలిసి ఒక హోటల్ కి పార్టీకి వెళ్లిందట. అక్కడ అందరూ కలిసి ఎంజాయ్ చేశారట. లేట్ నైట్ దాకా స్నేహితులతో కలిసి శీతల పానీయాలు కూడా తాగి ఎంజాయ్ చేసి ఆ మరునాడు ఇంటికి వచ్చారట. రెండు నెలలు గడిచిన తర్వాత ఆమెకు  ఆరోగ్యం దెబ్బతిన్నదని  ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకుందట. డాక్టర్ ఆమెకు పరీక్షలు చేసి గర్భవతి అని చెప్పడంతో షాక్ అయ్యానని చెప్పింది. వెంటనే ఆమె చెన్నైలోని అన్నా నగర్ మహిళా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసిందట. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. లైలా అనే అమ్మాయి గత రెండు నెలల క్రితం తన కాలేజీ స్నేహితులు ఆడ, మగ కలిసి ఒక హోటల్ వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ  పానీయాలు తాగారు. ఆ తర్వాత కొంతమంది మగ పిల్లలు  ఆమె మత్తులో ఉండగా  లైంగిక దాడికి పాల్పడినట్టు  ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ పాయింట్ బేస్ చేసుకుని  పోలీసులు ఆమె స్నేహితులను మరియు ఇతర వ్యక్తులను విచారిస్తున్నారు. నిజంగానే ఆ విద్యార్థులు ఆమెపై లాంగికదాడి చేశారా లేదంటే ఇంకా ఎవరైనా చేశారని కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line students pregnant chennai laila collage-friends

Related Articles