దేశవ్యాప్తంగా కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పలు విధాలుగా ఆ
న్యూస్ లైన్ డెస్క్: దేశవ్యాప్తంగా కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పలు విధాలుగా ఆ వ్యక్తిని విచారిస్తూ వివరాలు లాగుతున్నారు. అయితే ఈ విచారణలో ప్రజలు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయట. సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు ఆస్పత్రి మార్చురీలో ఉండేటువంటి మృతదేహాలతో కూడా శృంగారం చేసినట్టు తెలుస్తోంది.
ఆ వ్యక్తి శృంగారం చేస్తున్నటువంటి వీడియోలను, ఫోటోలను తన ఫోన్ లో పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇదే కాకుండా ఆ అమ్మాయి కేసులో అన్ని కారణాలను అన్వేషిస్తూ సీబీఐ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ విధంగా తన ఫోన్ నుంచి ఫోటోలను, వీడియోలను సీబీఐ అధికారులు రికవరీ చేసినట్టు తెలియజేశారు. అయితే ఆయన తన కామవాంఛ తీర్చుకోవడం కోసం మెడికల్ కాలేజీలోని మార్చరీలో మృతదేహాలతో కూడా శృంగారం చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా సీబీఐ నిర్వహించినటువంటి పాలిగ్రాఫ్ పరీక్షలో కూడా తాను తప్పు చేయలేదని ఒప్పుకున్నాడు. అయితే కోల్ కత్తా సెంట్రల్ జైల్లో ఆగస్టు 25న పాలిగ్రాప్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సిబిఐ సంజయ్ కి పది ప్రశ్నలు వేసింది. ఈ టైంలో సిబిఐ ముగ్గురు స్పెషల్ అధికారులు పాల్గొన్నారు. ఏది ఏమైనా సంజయ్ గురించి ఒక్కో విషయం బయటకు వస్తుంటే ఆ దుర్మార్గుడికి మరణశిక్ష వేయాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.