NABARD:పది పాసయ్యారా..రూ:35 వేల జీతంతో జాబ్స్.!

ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.  ఇదే తరుణంలో నాబార్డు సంస్థ నుంచి  ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 18 అటెండెంట్ గ్రూప్ సి ఖాళీల కోసం


Published Oct 01, 2024 08:50:00 AM
postImages/2024-10-01/1727752110_bard.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.  ఇదే తరుణంలో నాబార్డు సంస్థ నుంచి  ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 18 అటెండెంట్ గ్రూప్ సి ఖాళీల కోసం దరఖాస్తు కోరుతున్నది. పది పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనికి సంబంధించిన ఇతర వివరాలేంటో చూద్దాం..  

ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్ ) సంస్థ అంటే తెలియని వారు ఉండరు. ఈ సంస్థ ద్వారా రైతులకు ఎన్నో సర్వీసులు అందిస్తోంది.  అలాంటి ఈ సంస్థలో పదవ తరగతి ఉత్తీర్ణతతో గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు..

 అర్హత ప్రమాణాలు: పదో తరగతి పాస్ అయి ఉండాలి.

 జీతం: నెలకు 35000 ఉంటుంది.

 వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు.

 దరఖాస్తు విధానం :
 ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది.

 దరఖాస్తు ప్రారంభ తేదీ:
 అక్టోబర్ 2, 2024 నుంచి  అక్టోబర్ 21, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 పూర్తి వివరాలకు ఈ లింకు పై   https://www.nabard.org/  క్లిక్ చేయండి.

newsline-whatsapp-channel
Tags : telangana news-line jobs agriculture nabard tenth-pass

Related Articles