DIWALI : దీపావళి కి క్రేజీ ఆఫర్ ...9 రూ. కడితే 25 వేలు ఇస్తున్న ఫోన్ పే !


ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దీపావళి ఫెస్టివల్ ను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నది.


Published Oct 14, 2024 07:41:00 PM
postImages/2024-10-14/1728915185_phonepe.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి వచ్చేస్తుంది. క్రేజీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు అన్ని సంస్థలు.  ఇప్పటికే దీపావళికి చాలా ఆఫర్లు ప్రకటించాయి. అయితే ఫోన్ పే సంస్థ మాత్రం క్రేజీ ఆఫర్ ప్రకటించింది. జస్ట్ 9 రూ కడితే 25 వేలు భీమా ప్రకటించింది.  దివాళీ టపాసులు పేల్చుతే ఏదైనా ప్రమాదం జరిగితే ఈ భీమా వాడుకోవచ్చు.


ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దీపావళి ఫెస్టివల్ ను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నది.  ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ పాలసీ  దీని వల్ల టపాసుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే 25 వరకు కవరేజీని అందిస్తారు. దీనికి సంబంధించి ఫోన్ పే అక్టోబర్ 14న కీలక ప్రకటన చేసింది. ఇకపై తన ప్లాట్‌ఫాంలో టాపాసుల సంబంధిత ప్రమాదాల నుంచి సమగ్ర రక్షణ కోసం బీమా పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.


 అక్టోబర్ 25 నుంచి 10 రోజులపాటు ఈ బీమా కవరేజీ లభిస్తుందని ఫోన్ పే వెల్లడించింది. అయితే ఫోన్ పే యూజర్ తో పాటు భార్యాపిల్లలు సహా నలుగురు వ్యక్తులకు ఈ భీమా పనిచేస్తుంది.దీపావళిని దృష్టిలో పెట్టుకుని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది.


 ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి అందులో బీమా విభాగానికి వెళ్లి, హోమ్‌పేజీ నుంచి ఫైర్‌క్రాకర్ బీమాను ఎంచుకోవాలి. 


ఆ తర్వాత అవసరమైన వివరాలను నమోదు చేయాలి. 
‘ప్రొసీడ్ టు పేమెంట్’ ఆప్షన్ క్లిక్ చేసి పాలసీని కొనుగోలు చేయవచ్చు. 
మరి దీపావళి వేళ ఫోన్ పే అందిస్తున్న ఫైర్ క్రాకర్ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu diwali

Related Articles