Balka suman: కష్టం ఒకరిది.. ప్రతిఫలం ఇంకొకరికి

కష్టం ఒకరిది.. ప్రతిఫలం ఇంకొకరికి అని చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు.


Published Aug 09, 2024 06:00:49 PM
postImages/2024-08-09/1723206649_balka2.PNG

న్యూస్ లైన్ డెస్క్: కష్టం ఒకరిది.. ప్రతిఫలం ఇంకొకరికి అని చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. జైపూర్ మండలం, కుందారం గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి బాల్క సుమన్ అహర్నిశలు కష్టపడ్డారు. కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని 12.03.22 వ తేదీన ఆనాటి వైద్యశాఖ మంత్రి హరీష్ రావుని బాల్క సుమన్ కలిసి నిధులు మంజూరు చేపించారు. బాల్క సుమన్ కృషితో కేసీఆర్ ప్రభుత్వంలో 1.56 కోట్లతో కుందారం గ్రామంలో ఆరోగ్య కేంద్రానికి 09.01.23 వ తేదీన శంకుస్థాపన జరిగింది.

వారి చొరవతో గతంలోనే భవన నిర్మాణం పూర్తి అయింది. అయితే నేడు ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించిన కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించింది ముమ్మాటికి తనదే అని బాల్క సుమన్ అన్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే వివేక్ గాని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నది అక్షర సత్యం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ హయంలో జరిగిన అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకుంటోందని బాల్క సుమన్ విమర్శించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress cm-revanth-reddy government

Related Articles