uttarakhand: ఉత్తరాఖాండ్ లో రోడ్డు ప్రమాదం ..30 మంది మృతి !

పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యి భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటన ఉత్తరా ఖండ్ లో చోటుచేసుకుంది.


Published Oct 05, 2024 11:18:00 AM
postImages/2024-10-05/1728107468_uttarakhandbus.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సాధారణంగా ఉత్తరాఖండ్ లో ఈ కాలం అంత మంచి కాలం కాదు..కొండ చరియలు విరిగిపడడం , అకారణ వర్షాలతో బిక్కుబిక్కుమంటుంటారు. టూరిస్ట్ అయితే ఆ కాలంలో వెళ్లడం మానేస్తారు. కాని అక్కడే బతికే వాళ్లకి ఇదంతా చాలా సాధారణం. పనులు మానుకొని కూర్చోలేరు కదా. కొన్ని సార్లు మాత్రం చాలా దారుణాలు చూస్తుంటారు. ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యి భారీ ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటన ఉత్తరా ఖండ్ లో చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 25 నుండి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. అయితే ప్రయాణికులు మొత్తం 60 మంది కాగా ప్రస్తుతానికి 35 మంది లభించారు.అందులో 30 మంది మరణించగా మరో ఐదుగురు పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles