రాజీవ్ గృహకల్పలోని అపార్టుమెంట్లలో రెండో అంతస్థు వరకు నీళ్లు చేరుకున్నారు. దీంతో ప్రజలు ఇళ్లపైకి వెళ్లి రక్షించాలని కోరుతున్నారు.
న్యూస్ లైన్, ఖమ్మం: పట్టణంలోని మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మున్నేరు పరివాహక కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వరద కారణంగా ఇప్పటికే పలు కాలనీలు నీటిలో చిక్కుకుపోయాయి. రాజీవ్ గృహకల్పలోని అపార్టుమెంట్లలో రెండో అంతస్థు వరకు నీళ్లు చేరుకున్నారు. దీంతో ప్రజలు ఇళ్లపైకి వెళ్లి రక్షించాలని కోరుతున్నారు.
వెంకటేశ్వరనగర్ కాలనీలలో వరద ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దానవాయిగూడెంలో ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.