బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు తమా కష్టాన్ని.. కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారని మండిపడ్డారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రిని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న 30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చారన్నారు. నిన్న కాగ్నిజెంట్ కంపెనీని మీరే తెచ్చామన్నారు. నేడు సీతారామ ప్రాజెక్టును మీరే కట్టారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కష్టాన్ని ఎన్నిసార్లు.. మీ ఖాతాలో వేసుకుంటారని కేటీఆర్ సీఎం రేవంత్ని నిలదీశారు.
హద్దుమీరిన అబద్ధాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్యపెట్టాలని చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు శ్రీకారం చుట్టి మీరే లక్ష్యాన్ని చేర్చిన నాడు అది మీ సమర్థతకు ప్రతీక అవుతుందని అంతే తప్ప బీఆర్ఎస్ సర్కారు క్రెడిట్ను కొట్టేసే ప్రయత్నం మీరు ఎంత చేసినా నాలుగు కోట్ల ప్రజానీకం మాత్రం నమ్మదు. తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదని కేటీఆర్ విమర్శించారు.