Farmer: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య


జనగామ జిల్లా నర్మెట మండలంలోని కన్నెబోయిన గ్రామానికి చెందిన తోడేటి సాంబరాజు(29) అనే రైతు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే తన మూడెకరాల భూమిలో బోరు వేయడానికి రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడని కుటుంబసభ్యులు వెల్లడించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721372784_modi20240718T124322.635.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరో యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

జనగామ జిల్లా నర్మెట మండలంలోని కన్నెబోయిన గ్రామానికి చెందిన తోడేటి సాంబరాజు(29) అనే రైతు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే తన మూడెకరాల భూమిలో బోరు వేయడానికి రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. 

పంటలు సాగు చేయాల్సి ఉండగా, అప్పటికే అప్పులు ఇచ్చిన వాళ్లు చెల్లించాలనడంతో సాంబరాజుపై తీవ్రమైన ఒత్తిడి పడింది. దీంతో మనస్థాపం చెందిన సాంబరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam farmer

Related Articles