గోడ పక్కన పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
న్యూస్ లైన్, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన గాంధీభవన్ ప్రహారీ గోడ కూలిపోయింది. దీంతో గోడ పక్కన పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే, కారులో ఎవరూ లేకపోవంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కూలిన గోడలను తొలగించారు. అయితే గోడ రోడ్డువైపు కూలడంతోనే వాహనాలు ఎక్కువగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.