ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచినారు.
న్యూస్ లైన్ డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ఆదివారం నల్గొండ దేవరకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచినారు.
అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లు తెప్పించాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు కాలువలు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హరీష్ రావు సూచించారు. BRS పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి కోరారు.
ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దుచేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకరంగా ప్రవహించే వరదల్లో, చెరువులు, కాలువలు వద్దకు ఎవరు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా కాపాడాలని హరీష్ రావు అన్నారు.