అత్యాధునిక శాటిలైట్ , డ్రోన్ సాంకేతిక ఉండాలని తెలిపారు. లేకపోతే భారత్ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోలేదని అన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశప్రజల భద్రత కోసం అత్యంత కీలకమైన 10 శాటిలైట్లు పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. అంతేకాదు ఈ శాటిలైట్ల నిఘా నిరంతరం ఉంటుందని చెప్పారు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ రక్షణా బాధ్రతపై ప్రజలకు ధైర్యం చెప్పారు.దేశ భద్రత కోసం మన 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని నారాయణన్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక శాటిలైట్ , డ్రోన్ సాంకేతిక ఉండాలని తెలిపారు. లేకపోతే భారత్ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోలేదని అన్నారు.
ఇస్రోకు చెందిన ఈ 10 ఉపగ్రహాలు సరిహద్దు భద్రతతో పాటు అంతర్గత భద్రత వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తాయని నారాయణన్ తెలిపారు. దీంతో భారత్ వెంటనే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు భారత ప్రజలు యుధ్దం గురించి ఏం మాత్రం బయపడాల్సిన అవసరం లేదని శక్తివంతమైన , పటిష్టమైన భద్రత ఉందని తెలిపారు.