Jishnu Dev Varma: ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్న గవర్నర్‌

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహానికి చేసిన పూజా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. 


Published Sep 07, 2024 08:10:43 AM
postImages/2024-09-07/1725706925_jishnudevvarmainkhairathabad.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఖైరతాబాద్ మహా గణనాథుడిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహానికి చేసిన పూజా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. 

శనివారం మధ్యాహ్నం సప్తముఖ మహాశక్తి గణపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పూజలు చేశారు. గవర్నర్‌కు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ శ్రీరాముడి విగ్రహాన్ని అందించారు. పూజ అనంతరం జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణనాథుడిని దార్శనిన్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy news-line newslinetelugu telanganam governor telanganagovernor jishnudevvarma

Related Articles