డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల ఆగడాలతో పురుగుల మందు తాగి టీడీపీ కార్యకర్త, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
న్యూస్ లైన్ డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల ఆగడాలతో పురుగుల మందు తాగి టీడీపీ కార్యకర్త, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో జరిగింది. రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. నేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ సోషల్ మీడియాలో వీడియో తీసి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా మృతుడు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరులు ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య శరణ్యమని పురుగుమందు తాగి మృతి చెందారు.