balka suman: సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచింది

Published 2024-07-04 07:43:36

postImages/2024-07-04/1720095315_balkasuman.jfif

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బల్మూరి వెంకట్‌కి ఉద్యోగం వచ్చిందన్నారు. గురువారం బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోవటం లేదని, ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్లను ఆలకించండి లేదంటే అదే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొందరు మేధావులకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగుల సమస్యలు పట్టవా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గురు శిష్యులు చాలాసార్లు లోలోపల మాట్లాడుకున్నారని, ఇప్పుడు బహిరంగంగా భేటీ అవుతున్నారని విమర్శించారు. నీటి వాటా, ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ గట్టిగా నిలబడాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడతారని మాకు నమ్మకం లేదన్నారు. గురు శిష్యుల భేటీ తెలంగాణ వనరుల దోపిడీ కోసమేనేమోనాని అన్నారు. గురు శిష్యుల భేటీతో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతుందేమో అని ఆయన ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాట్లాడతారో ప్రభుత్వం బహిర్గతం చేయాలని మాట్లాడతారో అని బాల్క సుమన్ పేర్కొన్నారు.