Jagadish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టింది

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Jun 23, 2024 07:25:01 AM
postImages/2024-06-23/1719136565_jagadish.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.  ప్రభుత్వం రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదని, రుణమాఫీ చేస్తామని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించారు. కానీ ఎంత మంది ఇస్తారు, ఎవరు అర్హులో చెప్పాలేదని మండిపడ్డారు. ఇక రైతు భరోసా పై ప్రభుత్వం నాటకాలు ఆడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచ కాలు జరుగుతుందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదనే సంగతి కాంగ్రెస్ సర్కారుకి సోయి ఉందా లేదా అని నిలదీశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news

Related Articles