Team India: టీమిండియాకు రూ.125 కోట్లు ప్రకటించిన బీసీసీఐ 2024-06-30 21:18:01

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఐసీసీ( ICC) టైటిళ్ల కరవు తీర్చుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ ( ROHITH SHARMA)  నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో చాంపియన్స్ అయ్యారు. కొహ్లి ఫామ్ లో లేడనే ...అందరు అనుకున్నారు...ఫైనల్స్ కి వచ్చే సరికి ప్రతి ప్లేయర్ అదరగొట్టేశారు. దేశానికి కప్ వచ్చే వరకు చాలా కష్టపడ్డారు .అందుకే బీసీసీఐ గిఫ్ట్ ప్రకటించింది. 


బీసీసీఐ( BCCI)  కార్యదర్శి జై షా టీమిండియాకు( TEAM INDIA)  రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని జై షా స్వయంగా వెల్లడించారు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతమైన ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి కనబర్చిందని కొనియాడారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, ఇతర సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జై షా పేర్కొన్నారు. టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.


ఈ నజరానా ..ఆటగాళ్లకు మంచి బూస్ట్ అని అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి గిఫ్ట్స్ ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తాయని అంటున్నారు. అందులోను కోచింగ్ సిబ్బందిని , సహాయసిబ్బందిని కూడా ప్రోత్సహించడం చాలా సంతోషించదగ్గ విషయమంటున్నారు.