న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పలువురు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం కలెక్టర్గా శ్యామ్ప్రసాద్, విశాఖ కలెక్టర్గా హరీంద్రప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె.విజయ, అంబేద్కర్ కోనసీమ కలెక్టర్గా రావిరాల మహేష్కుమార్, పల్నాడు కలెక్టర్గా అరుణ్బాబు, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, తిరుపతి కలెక్టర్గా ఎస్. వెంకటేశ్వర్, అన్నమయ్య కలెక్టర్గా చామకూరి శ్రీధర్, కడప కలెక్టర్ శివశంకర్ లతోటి, సత్యసాయి కలెక్టర్గా చేతన్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.