Chandrababu: పారిస్ లో మరో అరకు కాఫీ కేఫ్...

2024-07-02 18:49:00
postImages/2024-07-02/1719926340_22arakucoffee1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు అరుకు ( ARAKU COFFEE)  కాఫీ ..గురించి మోదీ ( MODI) ట్వీట్ చేశారు ..ఈ విషయం అందరికి తెలిసిందే. 2016 లో సీఎం చంద్రబాబుతో కలిసి కాఫీ తాగుతునన ఫొటోను మోదీ ట్వీట్ లో షేర్ చేసుకున్నారు. దీని పై రియాక్ట్ అయ్యారు ఆనంద్ మహీంద్రా .


అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేస్తున్న నాంది ఫౌండేషన్ కు ( NANDHI FOUNDATION)  ఆనంద్ మహీంద్రా( ANAND MAHENDRA ) బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. ప్రధాని మోదీ ట్వీట్ పై ఆయన ఏమన్నారంటే... అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న బ్రాండ్ గా అవతరించిందని పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఫ్రాన్స్( FRANCE) లోని పారిస్ ( PARIS) లో అరకు కాఫీ కేఫ్ ను తెరిచామని, త్వరలోనే రెండో కేఫ్ ను కూడా ప్రారంభించబోతున్నామని తెలిపారు. 


"పారిస్ లో మరొక అరకు కాఫీ కేఫ్( COFFEE CAFE) ... ఇది చాలా గొప్ప వార్త. అరకు కాఫీ తన స్థాయికి తగిన విధంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూ ముందుకు వెళుతుండడం సంతోషం కలిగిస్తోంది. నాంది ఇండియా ఫౌండేషన్ కు చెందిన అరకునోమిక్స్, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చేయి కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రాడెక్ట్ కు ఓ మంచి గుర్తింపు ఇవ్వాలనుకోవడం సంతోషించాల్సిన విషయం అన్నారు.