Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రుతురాజ్ టీం విజయం

దులీప్ ట్రోఫీ మెగా టోర్నీలో టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ టీం గ్రాండ్ విక్టరీ కొట్టింది.


Published Sep 07, 2024 04:49:08 PM
postImages/2024-09-07/1725707948_duleep.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: దులీప్ ట్రోఫీ మెగా టోర్నీలో టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ టీం గ్రాండ్ విక్టరీ కొట్టింది. దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురంలోని రూరల్ డవలపమెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇండియా డి జట్టుపై ఇండియా సి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యార్ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 


ఇండియా సి జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేయడంతో విజయ దుదుంభి మోగించింది. రుతురాజ్ గాక్వాడ్(46), అర్యన్ జయాల్(47), రజత్ పాటీదర్(44), అభిషేక్ పోరెల్(35 నాటౌట్), సాయి సుదర్శన్ (22), మానవ్ సుథార్ (19 నాటౌట్) పరుగులు చేసి విజయం కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెటు, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసి మానవ సుథార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇండియా జట్టు బౌలర్లలో సరన్ష్ జోసి నాలుగు వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్, అక్షర పటేల్ చెరో ఒక వికెట్ తీశారు. మొదట రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా డి జటట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా సి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 168 రన్స్‌కు ఆలౌటయ్యింది. ఇక రెండో రోజు బ్యాటింగ్ చేసిన ఇండియా డి జట్టు సెకండ ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఇండియా సి జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేయడంతో విజయ ఢంక మోగించింది.
 

newsline-whatsapp-channel
Tags : telangana won-the-match india-team cricket-news test-match

Related Articles