Varalakshmi:'మల్లెమాల' అధినేత భార్య కన్నుమూత.!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది యంగ్ యాక్టర్స్ నుంచి ఓల్డ్ యాక్టర్స్ వరకు మరణిస్తున్నారు. దీంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా


Published Aug 08, 2024 08:53:32 AM
postImages/2024-08-08/1723087412_varalakshmishyamprasadreddy.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది యంగ్ యాక్టర్స్ నుంచి ఓల్డ్ యాక్టర్స్ వరకు మరణిస్తున్నారు. దీంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా శ్యాం ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి మరణించారు. మరి ఆమె ఏం చేశారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 ప్రముఖ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి అంటే ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.  ఈయన తెరపై కనిపించలేదు కానీ తెర వెనుక  ఎంతో కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు ప్రొడ్యూసర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అలాంటి శ్యాంప్రసాద్ ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలను నిర్వహించే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ కు  బాస్.

ఈయన ఆధ్వర్యంలోనే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ మొత్తం నడుస్తుంది. అలాంటి ఈ నిర్మాత అరుంధతి, అంజి, అంకుశం, అమ్మోరు, వంటి ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ గా పని చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు ఈయన. విజయ్ భాస్కర్ రెడ్డి కూతురు అయినటువంటి వరలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

 వరలక్ష్మి సోదరుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల డోన్ 2024 ఎలక్షన్స్ లో గెలుపొందారు.  వరలక్ష్మి కథ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో ఇబ్బందులు పడుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచింది. ఆమె మరణంతో ఇండస్ట్రీలో  విషాద ఛాయలు అలుముకున్నాయి.  దీంతో పలువురు ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood shyam-prasad-reddy varalakshmi-passes-away mallemala-entertinements

Related Articles