Xiaomi: షియోమీ నుంచి కొత్త ఫీచర్స్ తో 4K స్మార్ట్ టీవీలు.. లుక్ సూపర్ !

షియోమీ కంపెనీ తాజాగా కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇందులో షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సీరిస్ 2024 ఎడిషన్ నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలను ఇంట్రస్టింగ్ ఫీచర్స్ తో రిలీజ్ చేసింది.


Published Aug 28, 2024 09:35:00 AM
postImages/2024-08-28/1724818186_l43m44ainmioriginalimag496eqghnqhpu.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు అందరి ఇంట్లోను స్మార్ట్ టీవీలే. అది కూడా 15 వేలు పై మాటే. చిన్నా ...చితకా బ్రాండ్లే వేలకు వేలు ధరలు పెంచేస్తున్నారు.  అంతేకాదు ...ఎక్కడ చూడు జనాలు పెద్ద పెద్ద టీవీలకు ..అలవాటుపడిపోయారు. ఇంట్లోనే థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను కోరుకుంటున్నారు. ఈ లిస్ట్ లో షియోమీ కొత్త ఫీఛర్ టీవీలు కూడా యాడ్ అవ్వబోతున్నాయి.


షియోమీ కంపెనీ తాజాగా కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇందులో షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సీరిస్ 2024 ఎడిషన్ నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీలను ఇంట్రస్టింగ్ ఫీచర్స్ తో రిలీజ్ చేసింది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ కే ఇస్తుంది. 2024 ఎడిషన్ లో భాగంగా 43 ఇంచెస్, 55 ఇంచెస్ ఇంకా 65 ఇంచెస్ సైజుల్లో మూడు కొత్త స్మార్ట్ టీవీలు రిలీజ్ అయ్యాయి . ఈ టీవీలని ప్రీమియం మెటల్ బాడీ ఇంకా బెజెల్ లెస్ డిజైన్ తో చేశారు. 


ఈ టీవీలు కార్టెక్స్ ఏ 55 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో రన్ అవుతాయి. ఇక ర్యామ్ విషయానికి వస్తే.. ఇవి 2GB ర్యామ్ కలిగి ఉంటాయి. అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ టీవీలు వస్తాయి. ఈ షియోమీ 4K స్మార్ట్ టీవీలు వివిడ్ పిక్చర్ ఇంజిన్ తో వస్తాయి. మంచి విజువల్స్ కోసం MEMC రియాలిటీ ఫ్లో ఫీచర్ కూడా ఈ టీవీల్లో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీల్లో 30W సౌండ్ అందించే రెండు స్పీకర్ లు ఉన్నాయి. వీటి వల్ల మీకు థియేటర్ లో సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందంటున్నారు కంపెనీ.


వీటి ధరల విషయానికి వస్తే.. వీటిలో 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 28,999 ధరతో, 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 35,999 ధరతో ఇంకా అలాగే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీని 39,999 ధరతో కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ టీవీల ధరల పైన డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆగస్టు 30 వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్, mi.com, షియోమీ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu super-features ai-technology

Related Articles