ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏసీ మిషన్ ఊడిపోయి నెత్తిమీద పడింది. చూస్తుండగానే మిత్రుడు కుప్పకూలిపోయాడు.
న్యూస్ లైన్ డెస్క్ : ఎప్పట్లాగే ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాడు. రెగ్యులర్ గా ఆగి మాట్లాడుకునే చోటు కావొచ్చు. అలవాటుగా అక్కడే ఆగి ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏసీ మిషన్ ఊడిపోయి నెత్తిమీద పడింది. చూస్తుండగానే మిత్రుడు కుప్పకూలిపోయాడు.
ఢిల్లీలో ఏసీ మీద పడి 18 ఏళ్ల యువకుడు మృతి.. మరో యువకుడికి గాయాలు. pic.twitter.com/wWHKpa1iQR — Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
ఈ ఘటన ఢిల్లోని కరోల్ బాగ్ లో జరిగింది. ఆరుబయట ఓ యువకుడు బైకుపై కూర్చొని స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. అంతలోనే బిల్డింగ్ పై మూడో అంతస్తులో ఏర్పాటు చేసుకున్న ఏసీ మిషన్ ఊడిపోయింది. అది నేరుగా బైక్ పౌ కూర్చొని మాట్లాడుతున్న యువకుడి మీద పడింది. అంతే.. అక్కడిక్కడే అతడు ప్రాణాలు వదిలాడు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది.