రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారీ

రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఎక్కువ అయ్యింది. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720522908_liqour.PNG

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఎక్కువ అయ్యింది. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. తాజాగా కల్తీ మద్యం తయారీ చేస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లో కల్తీ మద్యం తయారు చేస్తున్న లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఓ మహిళను మంగళవారం ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మహిళ నుంచి 112 బాటిళ్లలో నింపిన 90 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ కల్తీ వైన్ తయారు చేస్తూ నిందితురాలు పోలీసులకు పట్టుబడింది. మద్యం తయారీ చేస్తూ ఆర్డర్‌ వచ్చిన తర్వాత నేరుగా వైన్ షాపులకు సప్లై చేస్తుంది. ఈ క్రమంలో వైన్ షాపుకు తరలిస్తుండగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana police cm-revanth-reddy arrest

Related Articles