Jagadish reddy: విచారణ కమిషన్‌కు రాసిన లేఖపై జగదీష్ వివరణ 2024-06-29 18:14:25

న్యూస్ లైన్ డెస్క్: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్‌కు మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy) మెయిల్ ద్వారా లేఖ రాశారు. శనివారం తెలంగాణ భవన్‌(Telangana bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం(press meet)లో ఆయన ఆయన రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. కమీషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి(L.Narasimha reddy) మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై లేఖ ద్వారా అభ్యంతరం చేసినట్లు జగదీష్ రెడ్డి వెల్లడించారు. 

ఛత్తీస్‌ఘడ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొన్నామని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థల నుండి విద్యుత్‌ను రూ.17  కొంటున్న పరిస్థితి ఉండేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రయత్నించారని తెలిపారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారని అన్నారు. 

పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలని తెలిపారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు 4.90 పైసలకు విద్యుత్ తీసుకున్నాయని వివరించారు. కేసీఆర్‌ను నిందించాలనే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 

అన్నీ అనుకూలంగా ఉన్న తర్వాతనే దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని తెలిపారు. ప్రతి పవర్ ప్లాంట్ 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టిందని అన్నారు. సింగరేణి బొగ్గు ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా తాము ఒప్పుకోలేదని అన్నారు. మేము కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చిందని తెలిపారు. 

విద్యుత్ విచారణ కమీషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన వెల్లడించారు. ఛత్తీస్‌ఘడ్ నుండి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం రాసుకోలేదని, కేసీఆర్, రమన్ సింగ్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందని అన్నారు. విచారణ కమీషన్ సరిగా లేదని తాను రాసిన లేఖలో పేర్కొన్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.