postImages/2024-07-01/1719843629_icct20.jpg

Worldcup: టీ20 వరల్డ్‌ కప్‌-2026 వేదిక ఖరారు

2024-07-01 19:50:29

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ 2026 వేదికలు ఖరారు అయ్యింది. ఈ మెగా టోర్నీ ఆతిథ్య బాధ్యతలను భారత్, శ్రీలంకలు తీసుకున్నాయి. భారత్‌, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటారు. కానీ 12 టీమ్లు మాత్రమే తమ స్థానాలను దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, అమెరికా, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు బర్త్‌లకు ఖరారు అయ్యి. ఇక సూపర్‌-8లో భారత్, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ల జట్లు ర్యాంకింగ్స్‌ పరంగా చోటు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024లో శ్రీలంక చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో లీగ్ ద‌శ‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. కానీ ఆతిథ్య జట్టుగా ఉండటంతో అది అర్హత సాధించగలిగింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా నిలిచిన టీమిండియా నేరుగా 2026లో జరిగే టోర్నీకి అర్హత సాధించింది.