postImages/2024-07-01/1719845549_gmcm.PNG

MGU: సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు

2024-07-01 20:22:29

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు దహనం చేశారు. రెండవ సంవత్సరం నాలుగవ సెమిస్టర్ పరీక్షా సమయంలో డీఎస్సీ, గ్రూప్ 2, సెట్, నెట్ పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని అనేక మార్లు రిజిస్టర్ ని విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి అద్దంకి జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు పట్ల వివక్షత చూపిస్తుందని ఇన్చార్జి వీసీ నవీన్ మిట్టల్ నల్గొండ జిల్లా మంత్రి తక్షణమే ప్రభుత్వం యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.