పోలీసు వాహనాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అనుచరులు ధ్వంసం చేశారు
న్యూస్ లైన్ డెస్క్: పోలీసు వాహనాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అనుచరులు ధ్వంసం చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల రాజభవన్ ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది. రాజ్ భవన్లో గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో రాజ్ భవన్కు ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు వచ్చారు. కాగా, వారిని అరెస్టు చేస్తుండగా కొంత మంది విద్యార్థులు పోలీస్ వాహనం పైకి ఎక్కి వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో రాజభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను కిందకి దింపి పోలీసులు అరెస్టు చేశారు.