Badrachalam: భధ్రాద్రి రాముడి సేవకుడికి వైకుంఠప్రాప్తి !

తన 14 వ ఏట నుంచి 70 సంవత్సరాల వరకు నిర్విరామంగా చేస్తున్న శ్రీ శేషం రాధాకృష్ణమూర్తి గారు తన తుది శ్వాస విడిచారు.


Published Aug 30, 2024 06:59:59 PM
postImages/2024-08-30//1725024599_badrachalampriest.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భద్రాచల రాముల వారి దాసుడు " శ్రీ శేషం రాధాకృష్ణమూర్తి గారు" వైకుంఠప్రాప్తి పొందారు. స్వామి వారి సేవ చేయడానికి పెట్టిపుట్టాలి. ఎంతో పుణ్యం దక్కితే కాని స్వామి పాదాల చెంత నిలబడి ఆయన రూపానికి దగ్గరగా చేరుకోలేము . అలాంటి భధ్రాద్రి రామయ్య కి మేలు కొలుపులు , సుప్రభాతం , దర్బార్ సేవ , పవళింపు సేవా కార్యక్రమాలు తన 14 వ ఏట నుంచి 70 సంవత్సరాల వరకు నిర్విరామంగా చేస్తున్న శ్రీ శేషం రాధాకృష్ణమూర్తి గారు తన తుది శ్వాస విడిచారు.


తొమ్మిది పదులు దాటిన,"శ్రీ శేషం రాధా కృష్ణ మూర్తి గారు (రాధాకృష్ణమాష్టారు)"  ఆరోగ్య సమస్యల కారణంగా కాలం చేయడం చాలా బాధగా ఉందంటున్నారు భద్రాద్రి రాముల వారి ఆలయ అధికారులు . హరిదాసు వ్యవస్థ లో వంశపారపర్యంలో ఆఖరివ్యక్తే ఈ రాధాకృష్ణమూర్తి. ఐదు , ఆరు తరాల నుంచి స్వామి వారి సేవలో వారి వంశీయులు పనిచేస్తున్నారు. భక్త రామదాసు తీసుకొచ్చిన హరిదాసు వ్యవస్థలో వంశపారంపర్య వ్యవస్థలోఆఖరివారు స్వామి ఐక్యం అయ్యారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rama sri-ramadasu

Related Articles