Telangana : బడివేళల్లో మార్పులు.. తెలంగాణ సర్కార్ నిర్ణ​​​​​​​యం

ప్రభుత్వ పాఠశాలల పనివేళలు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721464018_SchoolTiming.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల పని వేళల్లో మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు నడుస్తున్న పనివేళ్లల్లో మార్పు చేసింది. ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రి 4:15 గంటల వరకే పాఠశాలలు పనిచేయనున్నట్టు విద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు యాధావిధి పనివేళలే కొనసాగుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలే ఉండనున్నాయి. మారిన పనివేళలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.

 

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy congress-government telangana-government government-schools

Related Articles