దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. గ్రాము మీద పది రూపాయిలు పెరిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. గ్రాము మీద పది రూపాయిలు పెరిగింది. దాదాపు రెండు మూడు రోజుల నుంచి బంగారం పెరుగుతూనే వచ్చింది. ఈ రోజు కూడా బంగారం రేటు పెరిగింది .10గ్రాముల పసిడి ధర రూ. 10 పెరిగి.. రూ. 64,710కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 64,700గా ఉండేది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,47,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,471గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం10 గ్రాములు 70,590కి చేరింది. నిన్న 70,580గా ఉండేది. రోజు పద రూపాయిలు పెరిగింది.హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,710గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 70,590గా నమోదైంది. దాదాపు తెలుగు రాష్ట్రాలన్నింటిలోను ఇదే రేట్లు నడుస్తున్నాయి. అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,760గా.. నమోదయ్యింది.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,240గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 82,400గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 82,500గా ఉండేది.