IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.


Published Aug 16, 2024 10:51:17 AM
postImages/2024-08-16/1723820829_ipstrans.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఇక గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సుమిత్‌ సునీల్‌, అనంతపురం ఎస్పీగా జగదీష్‌, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వర్‌ రాజు, గుంతకల్‌ రైల్వే ఎస్పీగా రాహుల్‌ మీనా, ఇంటలిజెన్స్‌ ఎస్పీగా నచికేత్‌ విశ్వనాథ్‌, చింతూరు ఏఎస్సీగా పంకజ్‌కుమార్‌ మీనా, పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురాన్‌ అంకిత్‌ లను ప్రభుత్వం బదిలీ చేసింది. రేపు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

newsline-whatsapp-channel
Tags : telangana andhrapradesh police ias-officer

Related Articles