లీల్ ఖాన్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రి తరలించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో చిన్న సంఘటన అందరిని షాక్ గురిచేసింది. పార్టీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ వేదికపైనే అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా జలీల్ ఖాన్ వేదికపై ఉన్నారు. జలీల్ ఖాన్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం .
కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా జలీల్ ఖాన్ వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. జలీల్ ఖాన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 లో తెలుగుదేం పార్టీలో చేరారు. జలీల్ ఖాన్ను ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా కూడా నియమించారు. ఈ పదవి ముస్లిం మైనారిటీ వర్గాల్లో ప్రాముఖ్యత కలిగిందిగా చెప్తుంటారు.