Pawan Kalyan: ఏపీకి భారీ నిధులు.. కేంద్రానికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు

ఏపీకి కేంద్ర బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇవ్వడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.


Published Jul 24, 2024 08:30:00 AM
postImages/2024-07-24/1721787377_IMG20240724073820640x400pixel.jpg

న్యూస్ లైన్  డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం ఏపీకి అత్యవసరమని  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేంద్రం చొరవ తీసుకుని బడ్జెట్ కేటాయింపులు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు పవన్ కల్యాణ్.

రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి ₹15వేల కోట్లు కేటాయించడం హర్షణీయం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా  ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu pawankalyan andhrapradesh newslinetelugu telugu-news unionbudget

Related Articles