APPSC: ఏపీ గ్రూప్ -2 మెయిన్స్ వాయిదా

Published 2024-07-03 19:46:49

postImages/2024-07-03/1720016209_appsc.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష వాయిదా వెస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సిలబ్స్ మార్పు, ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షలకు సిద్ధం కాలేకపోయామని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల అభ్యర్థనను సానుకూలంగా తీసుకోవాలి ప్రజాప్రతినిధులు కోరారు. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్‌ను వాయిదా విసినట్లు ప్రకటించింది. కొత్త తేదిలను త్వరలో ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది.