Mahmood ali: చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు

వరద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మహముద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Sep 03, 2024 06:34:53 PM
postImages/2024-09-03/1725368693_mahood.PNG

న్యూస్ లైన్ డెస్క్: వరద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మహముద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సంద్భంగా ఆయన మాట్లాడారు. రవద బాధితులను ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రజలు బాధలో ఉంటే వాటిని గురించి మాట్లాడకుండా కేసీఆర్, కేసీఆర్ గురించి మాట్లాడడం ఏంటి అన్ని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించడానికి వెళితే కాంగ్రెస్ గుండాలు దాడులు చేయడం ఏంటీ అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోలీసులు దాడులు ఆపాలి కానీ పోలీసులు సపోర్ట్ చేయడం ఏంటి అని మహముద్ అలీ ధ్వజమత్తారు.  

newsline-whatsapp-channel
Tags : telangana brs cm-revanth-reddy congress-government mlc- mahammed-albar

Related Articles