ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు ‘యోగా మాసం’గా ప్రభుత్వం ప్రకటించింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విశాఖ పట్నం ప్రధాన వేదికగా " విశ్వమంత యోగాతో ఆరోగ్యం " అనే ట్యాగ్ లైన్ తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ సిధ్ధం చేసింది. జూన్ 21 న నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానుండడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీంతో ఈనెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు ‘యోగా మాసం’గా ప్రభుత్వం ప్రకటించింది.ఈ యోగా దినోత్సవ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
జూన్ 21న యోగా డే ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, యోగాకి ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని చంద్రబాబు అన్నారు. వచ్చే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకుంటున్నామని, ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చంద్రబాబు తెలిపారు.
ఇవాళ్టి నుంచి జూన్ 21వ తేదీ వరకు ఏపీలో యోగాంధ్ర జరుపుకోవాలని, జూన్ 21వ తేదీన విశాఖలో ఐదు లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా డే జరుగుతుందని చెప్పారు. ప్రతి మనిషి రోజుకు ఒక గంట యోగా చేయడం అలవాటుగా మార్చుకుంటే మీ ఆయుష్షు కూడా మారుతుంది.