Nivetha:నివేద థామస్ కి పెళ్ళైందా..ఆమె పిల్లలను చూస్తే షాకే.?

Published 2024-07-04 18:21:42

postImages/2024-07-04/1720097502_niveeytha.jpg

న్యూస్ లైన్ డెస్క్: నివేత థామస్  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మోస్తారు గుర్తింపు పొందిన హీరోయిన్. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా కంటెంట్ ఉన్న కథలలో నటించింది. అలాంటి నివేథా థామస్ కు పెళ్లయిందని పిల్లలు కూడా ఉన్నారని తాజాగా అనేక వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  మలయాళ భామ నివేదా థామస్ కు పెళ్లయిందని తన భర్త ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఒక ఫోటో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి తన అభిమానులంతా షాక్ అయిపోతున్నారు.  ఇంతకీ ఆమె భర్త ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేత 2011 లో వచ్చిన మలయాళ చిత్రం చెప్పకూరీష్ ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ లోకి జెంటిల్మాన్ చిత్రం ద్వారా వచ్చింది.  ఈమెను తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ మోహన్ కృష్ణ పరిచయం చేశారు. నాని ద్విపాత్రలో చేసిన జెంటిల్మెన్ మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. జై లవకుశ మూవీ లో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది.  ఈ విధంగా తను చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్ కొట్టాయి.

https://www.instagram.com/p/C88vLVYyFRB/?igsh=eGdkcWJ6d2loZGFi

అయినా నివేత మాత్రం స్టార్ హీరోయిన్ గా  పేరు తెచ్చుకోలేక పోయింది. అంతేకాకుండా వకీల్ సాబ్,  బ్రోచేవారెవరురా  వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే అలాంటి నీవేత థామస్ ఈ సినిమాల తర్వాత షేపౌట్ అయిపోయింది. ఇప్పటికే పొట్టిగా ఉండే నీవేద కాస్త బొద్దుగా కావడంతో  హీరోయిన్ లుక్ ఏ మాత్రం కనిపించడం లేదు.

తాజాగా ఈ బ్యూటీ  నాకు పెళ్లి జరిగింది ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే ఆమెకు పెళ్లయింది నిజజీవితంలో కాదు సినిమాలో అని తెలుస్తోంది. ఆమె తాజాగా నటించిన 35 చిన్న కథ కాదు  అని మూవీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేడుకలో నివేత మాట్లాడుతూ  నాకు పెళ్లయింది ఇతనే నా భర్త, వీళ్ళు నా ఇద్దరు పిల్లలు అని వేదిక మీద వారిని చూపించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  అయితే ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతుందని తెలుస్తోంది.