Team India: వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మానం !

Published 2024-07-04 20:14:22

postImages/2024-07-04/1720104262_20240704fr6686a38ec68a9.webp

 న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ -2024 విన్నర్ ...భారతదేశం...ఈ మాటే చాలా గర్వంగా ఉంది . టీమిండియా ఇవాళ స్వదేశానికి చేరుకుంది. ఈ సాయంత్రం వరల్డ్ కప్ నెగ్గిన సంతోషం ముంబై వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముంబై మెరైన్ డ్రైవ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓ వైపు సముద్రం మరో వైపు జనసముద్రం తో నిండిపోయింది.


బీసీసీ ఆటగాళ్లకు రూ.125 కోట్ల భారీ నజరానా అనౌన్స్ చేసింది.మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖడే స్టేడియం వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. అటు, వాంఖడే స్టేడియంలోనూ అభిమానులు పోటెత్తారు. క్రికట్ లవర్స్ అంతా....ఈ హీరోస్ ను చూడ్డానికి ఎగబడ్డారు.