AP: విజయసాయిరెడ్డి పై టీడీపీ మంత్రి ఫైర్ 

వైయస్సార్సీపి పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721298921_ap2.PNG

న్యూస్ లైన్ డెస్క్: వైయస్సార్సీపి పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మీడియా వాళ్లని అరేయ్, ఒరేయ్ అంటూ నీచమైన పదాలు వాడి సభ్య సమాజం సిగ్గుపడేలాగా ప్రవర్తించారని మంత్రి ధ్వజమెత్తారు. మీడియా వాళ్లు ఆరోపణ చేయలేదని శాంతి భర్త మదన్ మోహన్ కంప్లైంట్ చేశారని అన్నారు. విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళని బెదిరిచ్చే ధోరణిలో మాట్లాడటం అమానుషం అని మంత్రి కొనియాడారు. మద్యంతరం ఎన్నికలు వస్తాయి అంటూ మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థలపై విరుచుకుపడుతూ పిచ్చిపిచ్చిగా కామంతో విజయసాయి రెడ్డి కళ్ళు మూసుకుపోయాయి అన్నారు. 

డబ్బుతో పేర్ని నాని కళ్ళు మూసుకు పోయాయి అని తెలిపారు. మేము డీఎస్సీ అమలు చేయడంలోనూ ఇసుక ఫ్రీ విధానాన్ని, పెన్షన్ పెంచి ఇవ్వటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కొల్లి రవీంద్ర దీటుగా సమాధానం చెప్పారు. 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh tdp minister vijayasaireddy

Related Articles