సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో కలవనున్నారు
న్యూస్ లైన్ సినిమా: సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కల్యాణ్ను నిర్మాతలు కోరనున్నారు. అలాగే మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు పవన్తో చర్చించనున్నారు. పవన్ కల్యాణ్ని అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు కలవనున్నారు.