Ap:'శాంత'మ్మ నీ అసలు భర్త ఎవరమ్మ.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంత కాలం నుంచి విపరీతంగా  వైరల్ అవుతున్న వార్త ఏంటయ్యా అంటే  దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్తలకు సంబంధించిన వ్యవహారం. అయితే శాంతిని మొదటిసారి పెళ్లి చేసుకున్న మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి శాంతి విజయసాయిరెడ్డి వల్ల గర్భం దాల్చిందని, నావల్ల కాదని చెప్పారు. దీంతో ఆమె వ్యవహారం  విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా మెయిన్ మీడియాలో కూడా చాలామంది  అనేక కథనాలు ప్రసారం చేశారు. దీనిపై స్పందించినటువంటి శాంతి  అసలు నా గర్భానికి సంబంధించిన వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమీ లేదని, ఆయన ఒక పెద్దాయన అని ఆయన అలా మాట్లాడటం మంచిది కాదని చెప్పింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721621945_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంత కాలం నుంచి విపరీతంగా  వైరల్ అవుతున్న వార్త ఏంటయ్యా అంటే  దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్తలకు సంబంధించిన వ్యవహారం. అయితే శాంతిని మొదటిసారి పెళ్లి చేసుకున్న మదన్ మోహన్ మీడియా ముందుకు వచ్చి శాంతి విజయసాయిరెడ్డి వల్ల గర్భం దాల్చిందని, నావల్ల కాదని చెప్పారు. దీంతో ఆమె వ్యవహారం  విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా మెయిన్ మీడియాలో కూడా చాలామంది  అనేక కథనాలు ప్రసారం చేశారు.

దీనిపై స్పందించినటువంటి శాంతి  అసలు నా గర్భానికి సంబంధించిన వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమీ లేదని, ఆయన ఒక పెద్దాయన అని ఆయన అలా మాట్లాడటం మంచిది కాదని చెప్పింది. అంతే కాదు సాయిరెడ్డి నాకు తండ్రి లాంటి వాడని  తెలియజేసింది. అలాగే గిరిజన అమ్మాయిలు ఉద్యోగాలు చేయకూడదా? మంచి డ్రెస్సులు, బంగారం ధరించకూడదా? అని అన్నది. గిరిజన మహిళలు ఇలాంటి జాబులు చేస్తే తట్టుకోలేని కొంతమంది బురద పూస్తున్నారని  మీడియా ముందు ఎమోషనల్ అయింది. ఆ తర్వాత స్పందించినటువంటి విజయసాయిరెడ్డి  కొంతమంది కావాలని నాపై బురద జల్లుతున్నారని,  ఆమెనే చెప్పింది కదా నేను తండ్రి లాంటి వాడినని,  అలాంటి ఆ అమ్మాయితో నాకు ఎలా రిలేషన్ జతకట్టారు.

ఇలా నిరాధారణమైన వార్తలు రాసి నా పరువును బజారుకీడుస్తున్నారు వారందరినీ  నేను కోర్టుకి ఈడుస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక వీరిద్దరూ స్పందించిన తర్వాత మరోసారి  స్పందించినటువంటి మదన్ మోహన్  శాంతి చాలా డేంజర్ అని, ఆమె తప్పకుండా సాయిరెడ్డి ద్వారానే గర్బం పొందిందని, సుభాష్ అనే వ్యక్తితో గర్భం దాల్చానని చెప్పడంలో అబద్ధం ఉందని, ఇదే విషయమై సుభాష్ ని అడిగితే నాకు కూడా సంబంధం లేదని ఆయన చెప్పాడని మదన్మోహన్ చెప్పుకొచ్చాడు.  ఈ విధంగా శాంతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న తరుణంలో  రాష్ట్ర దేవాదాయ శాఖ స్పందించింది.

శాంతికి నోటీసులు కూడా జారీ చేసింది.  మీరు ఉద్యోగంలో చేరే సమయంలో మీ భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పారు. ప్రస్తుతం ప్రెస్ మీట్ లో మాట్లాడి నేను సుభాష్ ని పెళ్లి చేసుకున్నాను. ఆయన ద్వారా గర్భం దాల్చానని చెప్పారు. అసలు మీ ప్రవర్తన బాగాలేదని, ఇది ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం అంటూ నోటీసులు జారీ చేశారు. అసలు భర్త ఎవరో మాకు తెలియజేయాలని, వివరణ ఇచ్చిన తర్వాతే ఉద్యోగంలో చేరాలని నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం కాస్త ఆసక్తికరంగా మారిపోయింది. దీనిపై శాంతి ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ap vijayasaireddy madan-mohan shanti subhash-reddy

Related Articles